ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రులిద్దరూ కుమ్మక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ స్వార్థ రాజకీయ లాభాల కోసం ప్రజాసమస్యలను తాకట్టుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ నేత పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వె లుపల ఆయన విలేఖరులతో మా ట్లాడుతూ విభజన చట్టంలో ఇరురాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చట్టాలను రూపొందించిందన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ప్రజలు కూ డా నష్టపోకూడదన్నది కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. అయితే ఇటు కెసి ఆర్, అటు బాబు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి ఎక్కడ వేలెత్తి చూపిస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనన్న భయంతో తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారన్నారు. ఓటుకు నో టు విషయంలో చంద్రబాబునాయు డు, ఫోన్ ట్యాపింగ్‌లో కెసిఆర్ ప్రభు త్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ క్రమంలోనే ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. కెసిఆర్, చంద్రబాబు అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తారులే అని ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. రెండేళ్లుకూడా తిరగకముందే ఇరురాష్ట్రాల సిఎంల డొల్లతనం బయట పడిందని లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలుగు భా ష పరిరక్షణకోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టిందని, అయితే వాటిని నేటి ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని ఆరోపించారు. వీటిని ప్రభుత్వాలు పునః సమీక్షించుకొని అమలుచేయాలని తాను కోరుతున్నానన్నారు.