ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ కంటే బీజేపీ దగా ఎక్కువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 16: భారతీయ జనతాపార్టీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న పార్టీలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకం చేశారని, అన్ని పార్టీలను ఏకం చేసినా కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ధర్మపోరాట దీక్ష ద్వారా ప్రజలకు చెప్పేందుకు శ్రీకాకుళం జిల్లా సన్నద్ధం అవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఆదివారం ఇక్కడ ఆర్ అండ్ బి వసతి గృహంలో జరిగిన జిల్లా పార్టీ సమన్వయకమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అన్నారు. ఆనాటి కంటే ఇప్పుడు బీజేపీ చేస్తున్న అన్యాయమే ఎక్కువని, అందుకే కాంగ్రెస్‌తో జత కట్టామంటూ వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, జగన్మోహన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్, ఓవైసీలను రెచ్చగొట్టి ఏపీలో తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఉసిగొల్పుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ సాయం లేకుండా ఫ్రంట్ ఏర్పాటుచేసి కేసీఆర్ ప్రభుత్వం స్థాపించగలరా? అంటూ అచ్చెన్న ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఏపీలో జగన్, పవన్ చంకలు గుద్దుకోవడం దేనికి అంటూ ప్రశ్నించారు. ఏపీలో తన మిత్రుడు జగన్మోహన్‌రెడ్డికి సపోర్టు చేస్తానని ఓవైసీ చెబుతున్నారని, రాజకీయ స్వార్థంతో ఏపీలో ప్రచారం చేస్తామంటే ఓవైసీ మాటలు ఇక్కడ ముస్లిం సోదరులు నమ్మరని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏం చేయలేరంటూ సవాల్ విసిరారు.