ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ సంక్షోభం తీర్చామనడం హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభాన్ని తీర్చామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శే్వతపత్రం విడుదల చేస్తూ చెప్పడం ‘జోక్ ఆఫ్ ది ఇయర్’గా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు సంక్షేమం కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో కృషి చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శే్వతపత్రం లోపభూయిష్టంగా ఉందన్నారు. కరవు రైతుల కష్టాలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలోని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తాలను శే్వతపత్రంలో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.