ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి విశాఖ ఉత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 27: రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరాన్ని పర్యాటక రంగంలో కూడా మరింత ప్రోత్సహం అందించేందుకు ఏటా డిసెంబర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే విశాఖ ఉత్సవ్ నిర్వహణకు రంగం సిద్దమైంది. ఈ నెల 28 నుంచి 30 వరకూ మూడు రోజుల పాటు విశాఖ ఆర్కేబీచ్‌లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖ ఉత్సవ్ పండుగకు నగరం ముస్తాబు అవుతుంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, సెంట్ మీడియన్స్‌న్ని రంగులతో సొబగులు అద్దారు. దీనిలో భాగంగానే బీచ్‌రోడ్డులోని ప్రధాన వేదికతోపాటు, నమూనా దేవాలయాలు, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్, బారికేడ్లతో గేట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవ్‌కు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటక, జీవీఎంసీ ఇతర శాఖల అధికారులు, ఉత్సవ్ కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారులు పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఉత్సవ్‌కు సీఎం వస్తుండడంతో ఎటువంటి భద్రతా లోపం, ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా తగిన ఏర్పాట్లను పోలీస్ అధికారులు చేపడతున్నారు. అలాగే జిల్లాలోని సీఎం పర్యటన నేపథ్యంలో అనకాపల్లి మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదరణ పథకంలో మూడో విడత మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు.