ఆంధ్రప్రదేశ్‌

జనవరిలో 4 లక్షల ఇళ్ల పనులు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 29: గత మూడేళ్లలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద మంజూరైన ఆరు లక్షల ఇళ్లలో ఇంకా 60వేల ఇళ్లు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో శనివారం కలెక్టర్ల సదస్సులో రెండో సెషన్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇళ్లులేని పేదలు 10లక్షల మందికి పైగా ఉన్నట్లు ఆథార్ లింకేజీని అనుసరించి తెలుస్తోందని, వారందరికీ ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ ధ్యేయమని, జన్మభూమిలోగా ఎంతమందికి ఇళ్లులేవో అంచనా వేసి వారందరికీ కార్యక్రమం పూర్తయిన తరువాత గృహమంజూరు పత్రాలు అందించాలని సూచించారు. జనవరిలో మరో 4 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేసేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు గృహమిత్రలను నియమించుకోవాలని సూచించారు. ఒంగోలు, కడప, ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలుగా మారాయని ఈ మూడింటిలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు 19,57,429 ఇళ్లు మంజూరు కాగా 7లక్షల 45వేల 430 ఇళ్లు పూర్తయ్యాయి..మరో 11లక్షల 61వేల 812 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా, 4,06,142 ఇళ్లు పూర్తయ్యాయి. పీఎంఏవై, ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 1,20,943 మంజూరు కాగా 43071 పూర్తయ్యాయి. పీఎంఏవై, ఎన్టీఆర్ అర్బన్ కింద 3,86,804కు గాను 69,963 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, హుదూద్ బాధితులకు 9170 ఇళ్లకు గాను 8788 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు వివరించారు. కొత్తగా 2.65లక్షల దరఖాస్తులు అందాయని, అర్హులను గుర్తించాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలకు బకాయి ఉన్న రూ. 100 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. చంద్రన్న బీమా కింద కొత్తగా 56,783 దరఖాస్తులు అందాయని, గత నాలుగేళ్లలో రూ. 2400 కోట్లు అందజేశామని వివరించారు. చంద్రన్న పెళ్లికానుక పంపిణీలో జాప్యం, లోటుపాట్లు, అవకతవకలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద ఇప్పటి వరకు 3లక్షల 31వేల మందికి రూ.80.77 కోట్లు నిరుద్యోగ భృతి చెల్లించామని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధికి అన్ని జిల్లాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు.
ఫిబ్రవరి నాటికి 352 అన్న క్యాంటీన్లు
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్టవ్య్రాప్తంగా 352 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటైనా ఉండేలా చూడాలన్నారు. ఉదయం 350 మందికి అల్పాహారం, 450 మందికి మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రిపూట 300 మందికి ఐదు రూపాయలకే భోజనం లభిస్తోందని చెప్పారు.
ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి ప్రసూతి సేవలు
తమ ప్రభుత్వం ఇప్పటి వరకు వైద్యంపై తలసరి వ్యయాన్ని తగ్గించ గలిగిందని ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి తొలిసారిగా కాన్పులు చేర్చామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. గత ఏడాది కంటే స్వైన్‌ఫ్లూ 18 శాతం తగ్గిందని చెప్తూ అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటిలో నూరు శాతం వౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. గతేడాది 1456 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించామని అధికారులు తెలిపారు. బాలామృతం, అన్న అమృతహస్తం, మధ్యాహ్న భోజనంపై 90శాతం సంతృప్తి స్థాయి ఉందని దీన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం ఖరీఫ్‌లో కరవు మండలాల్లో చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.