ఆంధ్రప్రదేశ్‌

చెరువులకు నీటిని విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: గత సంవత్సరం మాదిరిగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ కింద చెరువులకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేసి చెరువులన్నింటినీ నింపేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ ఏడాది మరింత దారుణంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనంతపురం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు వేయలేదని, వేసిన అరకొర పంటలు కూడా నీరులేక ఎండిపోయాయని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కుడి కాలువ కింద చెరువులకు నీరు ఇవ్వనందు వల్ల గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారన్నారు.