ఆంధ్రప్రదేశ్‌

కొత్త సంవత్సరం తొలిరోజు ఉత్సాహంగా అమరావతి సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: అమరావతి రాజధాని నగర సందర్శన యాత్రకు కొత్త సంవత్సరం తొలిరోజు మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి 800 మంది ప్రజలు 17 బస్సుల్లో తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా గరుగుబిల్లి, విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్, రూరల్, కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా ఫిరంగిపురం, మేడికొండూరు, ప్రకాశం జిల్లా అద్దంకి, తాళ్లూరు, కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, యాదమరి, కడప జిల్లా ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల నుంచి అమరావతి సందర్శన యాత్రకు ప్రజలు తరలివచ్చారు. ఉద్దండరాయునిపాలెంలోని ఎక్స్‌పీరియన్స్ సెంటర్ త్రీడీ మోడల్ ఆసక్తిగా తిలకించారు. రాజధాని విశేషాలు అదికారుల ద్వారా తెలుసుకున్నారు. శంకుస్థాపన ప్రదేశం చూశారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, ఇతర రోడ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాలు, ఎన్జీవో, గెజిటెడ్, గ్రూప్ డి ఉద్యోగుల నివాసాల పనులను పరిశీలించారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గర సందర్శకులు ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. వెలగపూడి సెక్రటేరియట్‌ను సందర్శించారు. కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్ అమరావతి సందర్శన యాత్రకు సంబంధించిన అన్న ఏర్పాట్లను ప్రత్యేక అధికారుల ద్వారా చేయించారు. ప్రజలకు ఉద్దండరాయునిపాలెం దగ్గర ఏపీసీఆర్‌డీఏ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేశారు.