ఆంధ్రప్రదేశ్‌

మతంతో లబ్ధికి బీజేపీ కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 2: జన్మభూమి- మా వూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మతసంబంధమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. టీడీపీకి సంబంధించి ఇదే కీలకమైన సమయం.. ఈ పదిరోజులు గ్రామాలు, వార్డులలోనే ఉండాలని నిర్దేశించారు. భావితరాల భవిష్యత్తు వచ్చే ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా పార్టీశ్రేణులు పనిచేయాలన్నారు. బుధవారం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుష్టశక్తులు పార్టీ, రాష్ట్రంపై కక్ష కట్టాయి..ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించరు కానీ, పొరుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కోట్లు వెచ్చిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. నేనేదో ఆక్రోశంలో ఉన్నానని మోదీ అంటున్నారు.. గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే ఆక్రోశం ఆయనకే ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఏపీకి నిధులివ్వకుండా అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. అడుగడుగునా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు..ఇద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేశాం.. మోదీ అహ్మదాబాద్‌కు చేసిందేమీలేదు.. హైదరాబాద్‌ను మాత్రం తాను అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. అహ్మదాబాద్‌కు, హైదరాబాద్‌కు పొంతన లేదన్నారు. ఏపీకి సహకరిస్తే అభివృద్ధిలో మించిపోతుందని మోదీ భయమన్నారు. హుందాతనం లేకుండా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ నిలదీస్తారో అని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నారని, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ జీరో.. మోదీ, షా, ముగ్గురు సీఎంలు, 13 మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని విమర్శించారు. తెలంగాణలో కూటమి విఫలమయిందని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు..బీజేపీ యేతర కూటమికి బీటలు పడ్డాయని అరుణ్‌జైట్లీ చేస్తున్న వ్యాఖ్యానాలన్నీ హాస్యాస్పదమన్నారు. టీడీపీని జీరోచేస్తే బీజేపీ గెలుపుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు కూడ గడువు ఇవ్వకుండా హైకోర్టును తరలించారని ఆక్షేపించారు. కరవు, తుపాన్లకు మోదీ డబ్బులు ఇవ్వరు.. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు మంజూరు చేయరు.. హామీలు నెరవేర్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ గెలిస్తే తన అసమర్థత బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం, అధికార దాహంతోనే మోదీతో ప్రతిపక్షనేత జగన్ జతకట్టారని ఆరోపించారు. ఎవరైతే మనకు అన్యాయం చేశారో వారిపై మనం పోరాడుతున్నాం.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో జగన్ మిలాఖత్ అయ్యారు. ముగ్గురు మోదీలతో మనం పోరాటం చేస్తున్నాం.. ప్రజల్లో పట్టుదల పెరగాలి.. కసితో పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆశయం కోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలన్నారు. ప్రతిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వరాదన్నారు. మంచి పనులు చేయటమే కాదు.. చేసిన మంచిని ప్రజలు గుర్తించేలా ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మళ్లీ టీడీపీయే అధికారంలోకి రావాలి.. లేకపోతే రాష్ట్రం దెబ్బతింటుందనే భయం ఉంది.. ప్రజల ఆశలు..ఆకాంక్షల మేరకు పనిచేయాలన్నారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యమన్నారు. పరిపాలనలో పారదర్శకత కోసమే శే్వతపత్రాలు విడుదల చేశామని నాలుగున్నరేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. గ్రామాలు, వార్టుల్లో వసతులు పెంచామని తెలిపారు. సిమెంట్ రహదారులు, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఖర్చులు రూ. 5 లక్షలకు పెంచామని, చంద్రన్న బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు వివరించారు. ఆపదల్లో అందరికీ అండగా ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నో అవార్డులు సాధించాం.. రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మార్చామన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా ఇన్ని పనులు చేశాం.. అదే కేంద్రం తోడ్పాటు ఉంటే మరెన్నో చేసేవాళ్లమని స్పష్టం చేశారు.
దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఏపీ చేయని కేసీఆర్ అన్ని సీట్లలో గెలిచారు.. అన్నీ చేసిన మనం ఎన్ని సీట్లలో గెలవాలి.. ఆ కసి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో రావాలన్నారు. మత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యవహారంలో ఓ రకంగా, శబరిమల విషయంలో మరో రకంగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విభజించి పాలించాలనే దురుద్దేశంతో ఉందన్నారు. ముస్లిం కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదును సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 60,09,408 సభ్యులు నమోదు కాగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఆదరణ పరికరాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం.. దీన్ని బీసీలకు వివరించాలి.. బీసీలలో పార్టీ పట్టును పటిష్టం చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలకు అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు.