ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ఈడీగా రామారావు బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 3: ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పిన్నమనేని వెంకట రామారావుగురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌గా మూడేళ్లు పనిచేసి ఇటీవల పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, ప్రయాణికులకు కనీస సదుపాయాల కల్పన, ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తరువాత 1986లో ఆర్టీసీలో చేరారు. ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పనిచేశారు.
ఆ తరువాత గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం ప్రాంతాల్లో రీజనల్ మేనేజర్‌గా సేవలందించారు. విజయవాడలో రీజనల్ మేనేజర్‌గా మూడేళ్లు సేవలందించారు. విజయవాడ బస్ డిపోను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలందించారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆయన మూడుసార్లు స్వచ్ఛ భారత్ అవార్డులను అందుకున్నారు.