ఆంధ్రప్రదేశ్‌

ఎయిమ్స్ నిర్మాణాన్ని వేగం చేయండి: కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఎయిమ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జెపీ నడ్డాను కలసి ఏపీ ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు ఢిల్లీలో కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, అనిల్ మాధవ్ దవేలను కలసి పలు అంశాలు చర్చించారు. అనంతరం విలేఖరులతో కామినేని మాట్లాడుతూ విశాఖ మెడిటెక్ పార్కుకు రూ.75కోట్లు విడుదల చేస్తామని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హామీ ఇచ్చారని చెప్పారు. కొల్లేరు సరస్సును కాంటూర్ 5 నుంచి 3కు కుదింపు అంశంపై కేంద్రమంత్రి అనిల్ దవేకు వివరాలు అందించామని, త్వరలో నిర్ణయం తీసుకొంటామని కేంద్రమంత్రి చెప్పారని వెల్లడించారు.