ఆంధ్రప్రదేశ్‌

హోదాకు చంద్రబాబే అడ్డంకి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి శకునిలా మారారని, ప్రత్యేక హోదా, మిగిలిన అంశాలు అమలు కాకపోవడానికి ఆయనే ప్రధాన అడ్డంకి అని ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లు విషయంలో బాధ్యత లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపి నేతలు రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ప్రైవేటు మెంబర్ బిల్లులు 14 చట్టాలుగా అయిన సందర్భాలున్నాయని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభలోప్రైవేటు మెంబరు బిల్లును అడ్డుకోవాలని చూస్తే టిడిపి, బిజెపిలు చరిత్రహీన పార్టీలుగా మిగులుతాయని ఆయన హెచ్చరించారు. బిల్లుకు సహకరించకపోతే చంద్రబాబు మొదట ముద్దాయిగా, మోదీ, వెంకయ్య, అరుణ్ జైట్లీలు తర్వాత వరుసలో నిల్చిపోతారని రఘువీరా స్పష్టం చేశారు.