ఆంధ్రప్రదేశ్‌

దేశవ్యాప్తంగా 167 కేంద్రాల్లో ముగిసిన విట్ ఆన్‌లైన్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే విట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 10న మొదలై ఆదివారం ముగిసింది. అమరావతిలోని విట్ ఏపీ క్యాంపస్‌లో పూర్తిగా కంప్యూటర్ అథారిత పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం వీఐటీలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా లక్షా 62వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసందర్భంగా వీఐటీ ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి శుభాకర్ మాట్లాడుతూ వీఐటీలో జరుగుతున్న రికార్డు స్థాయి నియామకాలు, వినూత్నమైన కోర్సులు, ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులనూ ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని విట్ ఏపీ రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్ వివరించారు.