ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం 1051 పంచాయతీ కార్యదర్శి పోస్టు (గ్రేడ్ 4)లకు గాను రాష్టవ్య్రాప్తంగా 1320 పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా జరిగింది. అయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పరీక్ష జరిగింది. కలెక్టర్లందరికీ ఏపీపీఎస్‌ఈ చైర్మన్ ఉదయభాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాత్రం రెండు సెంటర్లలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. మొత్తం 4,95,526 మంది దరఖాస్తుదారుల గాను 3,89,014 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 2,94,966 మంది (75.82 శాతం) స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు.