ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లలో ఏ జగన్నాటకం చూసి ప్రజలు ఓటేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి గత ఐదేళ్లలో ఆడిన ఏ నాటకాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఓటేశారో ఆ పార్టీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉందని శాసనమండలిలో ప్రభుత్వ విప్, టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. నగరంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యిందనీ, జీవీఎల్‌పై ఓ వ్యక్తి విసిరిన చెప్పు ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతోందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రానికి చెందిన జీవీఎల్ నరసింహారావు అడుగడుగునా రాష్ట్రంపై విషం చిమ్ముతున్నాడని విమర్శించారు. ఆయన జోవియల్ నరసింహారావులా తయారయ్యారని వ్యాఖ్యానించారు. జీవీఎల్‌పై చెప్పు పడినట్టు విజయసాయిరెడ్డి పైనా చెప్పులు పడేరోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు దెబ్బకు మోదీ కూడా అబ్బా అంటున్నాడని, ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదన్నారు. ఎన్నికల్లో ఒక్కో ఓటుకు జగన్ 6నుంచి 8వేల రూపాయల చొప్పున 8వేల కోట్లు ఖర్చు చేశాడని ఆరోపించారు. చంద్రబాబు తాగునీటిపై సమీక్ష చేస్తే ప్రతిపక్ష నేత ప్రధానికి పోన్ చేస్తాడని, ప్రధాని ఈసీకి చెప్పి సమీక్షలకు అడ్డుతగులుతాడని, ఇదే నేడు జరుగుతున్న రాజకీయ తంతు అని విమర్శించారు. వీరందరి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం తప్పదని బుద్దా వెంకన్న వివరించారు.