ఆంధ్రప్రదేశ్‌

ఆర్నెల్లలో టీడీపీ ప్రధాన కార్యాలయం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 24: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నూతక్కి గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో చేపట్టిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని ఆర్నెల్లలో పూర్తిచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మూడు బ్లాకులుగా ఐదంతస్థులతో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం జరుగుతోంది. సుమారు నాలుగెకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి సేకరించి ఈ భవనాన్ని అధికారికంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేలా నిర్మిస్తున్నారు. బయట జరుగుతున్న పనులతో పాటు అంతర్గతంగా ఇంటీరియర్ డెకరేషన్ పనుల గురించి చంద్రబాబు నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్ కనస్ట్రక్షన్స్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, పార్టీ నేతలు ఎల్వీ రమణ, దారపనేని నరేంద్ర, బీద మస్తాన్‌రావు, రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...టీడీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులు పరిశీలిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు