ఆంధ్రప్రదేశ్
కాకినాడలో మెగా ఫుడ్పార్కు రూ. 184.88 కోట్లతో ఏర్పాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 5 August 2016
న్యూఢిల్లీ,ఆగస్టు 4: సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పార్కును రూ.184.88 కోట్ల అంచనా వ్యయం ప్రారంభించనుంది. విశాఖపట్నం, కాకినాడ మధ్యలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడానికి ఈ పార్కును కోస్టల్ ఎకనామిక్ జోన్లో(సిఇజడ్)లో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర షిప్పింగ్ శాఖ గురువారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. దీనితో పాటు మహారాష్ట్ర ప్రాంతంలోని కొంకణ్ పోర్టు వద్ద రూ.139.33 కోట్ల అంచనా వ్యయంతో మరో మెగా ఫుడ్పార్కును ఏర్పాటు చేస్తారు.