ఆంధ్రప్రదేశ్
మోదీ, షా మతిస్థిమితం కోల్పోయారేమో?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 May 2019
విజయవాడ, మే 22: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల పరిస్థితి చూస్తుంటే మతిస్థిమితం కోల్పోయారేమోనన్న అనుమానం కలుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో దేశంలో ఏ వర్గానికీ మేలు చేయకుండా బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పడమే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలకు బీజేపీని మరో ఐదేళ్ల పాటు భరించే ఓపిక లేదన్నారు. మోదీ ఇక హిమాలయాలకు శాశ్వతంగా వెళ్లడం మంచిదని, గుహ అద్దెకు తీసుకుని శాశ్వతంగా అక్కడే ఉండాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల క్రతువును ఒక తీర్థయాత్రగా పోల్చడం సరికాదన్నారు. జగన్ను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న నిజాన్ని వైకాపా నేతలు గమనించాలన్నారు.