ఆంధ్రప్రదేశ్‌

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకార మహోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, జూన్ 15: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య సన్యాస ఆశ్రమ దీక్షా స్వీకార మహోత్సవాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో తొలిరోజు సాంప్రదాయబద్ధంగా శారదాపీఠ ఉత్తరాధికారి నియామక ప్రక్రియను నిర్వహించారు. ఉత్తరాధికారి కిరణ్‌కుమార్ శర్మ పవిత్ర కృష్ణాస్నానం ఆచరించి హోమ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రముఖులు విచ్చేసి స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, జోగి రమేష్, మల్లాది విష్ణు, అన్నపురెడ్డి అదీప్‌రాజ్‌తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ ఆర్‌కే మీనా, అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, సినీనటి శారద, సినీ హీరో శ్రీకాంత్ దంపతులు పాల్గొన్నారు.
చిత్రాలు.. అమ్మవారికి పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర స్వామి,
* హోమ క్రతువు నిర్వహిస్తున్న శారదా పీఠం ఉత్తరాధికారి