ఆంధ్రప్రదేశ్‌

‘బాబుపై కుట్రలు, కుతంత్రాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును వ్యక్తిగతంగా అవమానించేందుకు కుతంత్రాలు చేశారని, తాజాగా అసెంబ్లీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు చంద్రబాబును అవమానించేలా వ్యవహరించారని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌కు ధన్యవాదాలు చెప్పింది తక్కువ, చంద్రబాబుని విమర్శించింది ఎక్కువ అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై హత్యలు, దాడులు చేయిస్తున్నారని బుద్దా అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అవమానించడం కరెక్ట్ కాదన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందన్నారు. గతంలో అధికారులను జగన్, విజయసాయిరెడ్డిలు ఎంత తిట్టినా తాము ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెడితే మంచిదంటూ బుద్దా హితవు పలికారు.