ఆంధ్రప్రదేశ్‌

మున్ముందు కాంగ్రెస్ మటుమాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మటుమాయం కావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో 220 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 శాతం ఓట్లు సాధించామని అనేక చోట్ల 62 శాతం ఓట్లు కూడా వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఓటమి చెందినప్పటికీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని భారతదేశ చరిత్రలో సరికొత్త రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు.
విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాజకీయ మనుగడ కావాలంటే ప్రజలు టీఆర్‌ఎస్ వైపు చూస్తారు... భవిష్యత్ కావాలంటే బీజేపీ వైపు చూస్తారని అన్నారు. దేశంలో కాంగ్రెస్, వామపక్షాలకు బలంగా ఉన్న చోట్ల ఈ దఫా బీజేపీ ఘనమైన ఓట్లే కాదు సీట్లు కూడా సాధించడం జరిగిందన్నారు. కర్నాటకలో తాము అధికారంలో లేనప్పటికీ ఎక్కువ సీట్లు గెలిచామని త్రిపుర, బెంగాల్‌లో తమ పార్టీ బలపడిందని అన్నారు. కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా గతంలో ఎన్నడూ ఓటమి చూడని నేతలు కూడా ఈ దఫా ఓటమి చెందారంటూ, కేరళలో వామపక్షాలకు కాలం చెల్లిందని చెప్పారు. చాలా చోట్ల 15 శాతం ఓట్లు సాధించామని అన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతున్న పరిస్థితి కన్పిస్తున్నదంటూ రానున్న రోజుల్లో చంద్రబాబుకు రాజకీయ మనుగడ లేకుండా పోగలదని మురళీధరరావు జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రధాని మోదీ సహకారంతో వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించులేకపోయారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు అధికారంలోకి వచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైకాపాను ఎలాంటి పరిస్థితిలోనూ ఇబ్బంది పెట్టకపోయినా తాము ప్రతిపక్షపాత్ర పోషిస్తామన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో బలమైన శక్తిగా ఏదుగుతామని ఇక అక్కడ భవిష్యత్ తమదేనని అన్నారు. ఏపీలో టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదని అన్ని పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేస్తున్నారు కానీ జాతీయ స్థాయిలో ఏ నేత కూడా ఉత్సాహంగా లేరని అన్నారు.
ఇక దేశంలో బీజేపీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించబోతున్నామంటూ జూలై ఆరు నుంచి నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి 20 శాతం పెంచాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ, బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పార్టీ ప్రచార ప్రతినిధి వల్లూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు