ఆంధ్రప్రదేశ్
గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి జిల్లా సెలక్షన్ కమిటీ ఏర్పాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 August 2019
విజయవాడ, ఆగస్టు 16: గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామకానికి జిల్లా సెలక్షన్ కమిటీని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులుండే ఈ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్లుగా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్గా జడ్పీ సీఈవో, సభ్యులుగా జేసీ-2, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జాయింట్ డైరెక్టర్లు, ఉద్యాన, సెరికల్చర్, మత్స్య, సాంఘిక సంక్షేమ శాఖల డిప్యూటీ డైరెక్టర్లు, సర్వే, ల్యాండ్ రికార్డు విభాగం అసిస్టెంట్ డైరెక్టరు, అదనపు ఎస్పీ (పరిపాలన), డీఎంహెచ్వో, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ వ్యవహరిస్తారు.