ఆంధ్రప్రదేశ్‌

కేంద్రమంత్రి వెంకయ్యను విస్మరించిన పోలీస్ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాల సందడిలో తలమునకలై వున్న పోలీస్‌శాఖ చివరకు కేంద్రంలో కీలకమైన సీనియర్ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును సైతం విస్మరించింది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ సకాలంలో ఎస్కార్ట్ వాహనం గన్నవరం విమానాశ్రయంకు వెళ్లకపోవటంతో ఆయన తన సొంత గన్‌మెన్‌లు, వ్యక్తిగత కార్యదర్శులతో సింపుల్‌గా నగరానికి చేరుకోటం పలువురిని ఆశ్చర్యపరచింది. సోమవారం సాయంత్రం హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బిజెపి నేతలు 70 ఏళ్ల స్వాతంత్య్రంపై పలు రంగాల ప్రముఖులకు సత్కార కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతోపాటు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పాల్గొనాల్సి వుంది. ఇక వెంకయ్యనాయుడు హైదరాబాద్ నుంచి విమానంలో సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం చేరుకున్నారు. అయితే ఎస్కార్ట్ రాకపోవటంతో గన్నవరంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ నుంచి వచ్చిన రెండు కార్లలో బయలుదేరి నేరుగా సభాస్థలికి చేరుకున్నారు. ఆలస్యంగా తేరుకున్న ఎస్కార్ట్ పోలీస్‌లు వాయువేగంతో అక్కడికి చేరుకున్నప్పుడు వెంకయయనాయుడు వారి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక కోడెల వెంట కూడా సరైన సెక్యూర్టీ కన్పించలేదు.