ఆంధ్రప్రదేశ్‌

ఏపికి 44 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22:కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కాంపా నిధుల కింద రూ.44 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే అధ్యక్షతన కాంపా నిధులపై వివిధ రాష్ట్రాల అటవీ మంత్రులతో ఢిల్లీలో జరిగిన సమావేశానికి మంత్రి బొజ్జల హాజరయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంపా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి అటవీ భూముల వినియోగంపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు వారం రోజుల్లో సమాధానం చెబుతామన్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి 13,265 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించాలని కోరినట్లు బొజ్జల తెలిపారు.