ఆంధ్రప్రదేశ్‌

మధ్యంతరం వస్తే మీ ఓటెవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 26: ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు.. ఆప్షన్లు.. వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్.. జనసేన.. తెలుగుదేశం/బీజెపి, వామపక్షాలు.. మీకు మద్దతిచ్చేది ఏ పార్టీకంటూ మొబైల్ ఫోన్ల ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయ సేకరణకు కసరత్తు ప్రారంభించింది.. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ఈ రకమైన ప్రశ్నలు అన్ని నెట్ వర్కుల ద్వారా వినియోగదార్ల ఫోన్లకు వస్తున్నాయి. 040-38399999 నెంబరు ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. తిరిగి అదే నెంబరుకు ఫోన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి స్వాగతం అంటూ పార్టీ సంక్షేమ కార్యక్రమాలైన ప్రమాదబీమా, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు ఫలానా నెంబరును ప్రెస్ చేయాలనే సంకేతాలు అందుతున్నాయి. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీ ఏపిలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు అవగతమవుతోంది. కొత్త రాజధాని, పోలవరం నిర్మాణం.. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు.. కేంద్ర సాయంపై బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటి వరకు పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగంతోపాటు పార్టీ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ టెక్నాలజీ వినియోగంతో ముందస్తు వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నీ తానే అయి శాఖల పనితీరుని పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా అభియోగాలు వస్తున్నందున సర్వేలు, ప్రజాభిప్రాయం ద్వారా పనితీరును తెలుసుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది వరకు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న అనంతర పరిణామాలను కూడా అధినేత నిశతంగా పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. కేంద్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాలతో పాటు జనసేన పార్టీకి వేరుగా ఆప్షన్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొబైల్ ద్వారా వచ్చే ప్రశ్నలలో బిజెపిని కలుపుకుంటూ రెండింటికీ మద్దతిచ్చిన జనసేన పార్టీ విజయావకాశాలపై అభిప్రాయాలు కోరటంలోని ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగా ఇప్పుడే ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి వస్తోందనే విషయమై అధికార పార్టీలో చర్చకు వస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రభుత్వరంగ సంస్థల విభజన అంశాలతో పాటు పోలవరాన్ని కేంద్రం కూడా వివాదాస్పదంగా పరిగణిస్తోందని, వీటినే ప్రతిపక్ష పార్టీలు విమర్శన అస్త్రాలుగా సంధిస్తున్నందున కేంద్రంపై తాడోపేడో తేల్చుకునేందుకు ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు క్యాడర్‌ను కాపాడుకునేందుకు అధికార పార్టీ కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది.