ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ది నియంతృత్వ పాలన: టీడీపీ నేత వర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నిరంకుశత్వ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇస్తూ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన జరుగుతోందన్నారు. ఈ 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి, అధికారుల మైండ్‌సెట్ ప్రజలకు బాగా అర్థమైందని విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల వ్యాఖ్యానించారు. ఈ 100 రోజుల పాలనలో టీడీపీ కార్యకర్తల మీద 223 దాడులు జరిగాయని, 12 మంది హత్యకు గురయ్యారని, 71 సంఘటనల్లో ఆస్తులను ధ్వంసం చేసారని, 154 మందికి గాయాలయ్యాయని, ఇది నిరంకుశత్వ పరిపాలనకు నిదర్శనం కాదా అన్నారు. దీనిని ఫాసిస్టు పాలన కాక ఏమి అనాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలపై టీడీపీ నాయకులు 33 ఫిర్యాదులు చేస్తే ఒక్క కేసులో కూడా చర్యలు తీసుకోలేదని, అదే వైసీపీ ఫిర్యాదు ఇస్తే అది చిన్న కేసైనా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నారన్నారు.