ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ నిందితులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 29 : ఖాతాదారులను మోసగించారన్న అభియోగాలు ఎదుర్కొంటూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌లోవున్న అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించారు. ఛైర్మన్ రామారావుకు గతంలో గుండె సంబంధమైన చికిత్సలు జరిగాయి. ఆయనకు షుగర్ లెవెల్స్ పెరిగినట్లుగా గుర్తించారు. అలాగే నారాయణరావుకు ఆయాసం, నీరసం వంటి ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు.