ఆంధ్రప్రదేశ్‌

మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిఘాకు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: భద్రతా కారణాల దృష్ట్యా ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిఘాకు గడువును సంవత్సరం పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలో నిఘా ఉంచేందుకు అనుమతించిన గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ గడువు పొడిగించింది. ఈ మేరకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నిఘా)కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ సేవలపై నిఘా ఉంచేందుకు ముందుగా హోం శాఖ కార్యదర్శి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.