ఆంధ్రప్రదేశ్‌

చెంగువీరవా.. పవన్‌కళ్యాణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: చేగువేరా తనకు ఆదర్శమన్న పవన్‌కళ్యాణ్ నేడు చెంగువీర అయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఎద్దేవా చేశారు. బీజేపీతో ఎందుకు కలుస్తున్నదీ పవన్‌కళ్యాణ్ స్పష్టం చేయాలన్నారు. గురువారం నారాయణ ఇక్కడ మాట్లాడుతూ పవన్‌వి స్వార్థ ప్రయోజనాలని విమర్శించారు. ఆయన దూరమైనందుకు తాము బాధపడటం లేదని, అయితే కమ్యూనిస్టు భావజాలం ఉందని చెప్పుకునే పవన్‌కళ్యాణ్ మతతత్వ పార్టీతో ఎలా జతకట్టారని ప్రశ్నంచారు. వామపక్షాలకు బాకీలేదన్న ఆయన ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీపడ్డారన్నారు. అవకాశవాదంతో పార్టీలు మారడం సహజమని, అయితే సిద్ధాంతాలు నచ్చాయని చెప్పటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి ఏ ప్రయోజనాలను కాపాడతారని నిలదీశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీని తెచ్చిన మోదీ, అమిత్‌షా దేశద్రోహులని, అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్ కూడా దేశద్రోహేనని నారాయణ ధ్వజమెత్తారు. రామకృష్ణ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ది పచ్చి అవకాశవాదమని అభిప్రాయపడ్డారు.
రన్న ఆయనకు నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్‌యుకు వెళితే పవన్ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. దమ్మున్నవారే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని అంటూ, ఆయనకు దమ్ముందో, లేదో పవన్ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.