ఆంధ్రప్రదేశ్‌

కుంటలో పడి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, సెప్టెంబర్ 18: కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పల్లెంపల్లి గ్రామ సమీపంలో గల వైరా ఏటి నీటి కుంటలో పడి ఆదివారం ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీరులపాడు మండలం కొణతాలపల్లికి చెందిన తుపాకుల శ్రీనివాసరావు (37) తన బైక్‌ను శుభ్రం చేసుకుంటుండగా అతనితో వెళ్లిన మేనళ్లులు వీరంశెట్టి అరుణ్‌కుమార్ (11), సుగ్గన నారేంద్రబాబు (9) నీటి కుంటలో స్నానం చేసేందుకు దిగారు. వారు మునిగిపోతున్న విషయాన్ని గమనించిన శ్రీనివాసరావు కాపాడేందుకు వెళ్లి అతనూ మునిగిపోయాడు. నందిగామ రూరల్ సిఐ సత్యకిషోర్, వీరులపాడు ఎస్‌ఐ అవినాష్‌లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.