ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్వకల్లు, సెప్టెంబర్ 18 : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని పుడిచెర్ల గ్రామ సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌కు చెందిన మహేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాణ్యంలోని కొత్తూరు సుబ్బరాయుడిస్వామి దర్శనార్థం వెళ్లారు. తిరిగి కర్నూలు వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రామ్‌ప్రసాద్‌రెడ్డి (44), మహేశ్వరరావు (55), అతడి భార్య మున్నీరమ్మ (45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తెలిపారు.