ఆంధ్రప్రదేశ్‌

బాలిక కిడ్నాప్, అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, సెప్టెంబర్ 20: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొర్లమండకు చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన అబ్బదాసరి జోజి కిడ్నాప్ చేయడంతో పాటు బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో అతనిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి మంగళవారం విలేఖర్లకు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన అబ్బదాసరి జోజి సంవత్సర కాలంగా కొర్లమండలో నివాసం ఉంటూ మత బోధకుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలిక, ఆమె తల్లిదండ్రులు తరచూ భగవత్ ప్రార్ధనలకు వస్తుండేవారు. ఈ నేపథ్యంలో బాలికపై కనే్నసిన జోజి ఆమెకు మాయమాటలు చెప్పి తనకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నాడు. ఈ నెల 12న బాలికను తనతో పాటు తీసుకువెళ్ళి రాజమండ్రి సమీపంలోని ఒక కుగ్రామంలో ఉంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక తెలిపిన వివరాలను బట్టి తెలిసిందని ఎస్‌ఐ అన్నారు. 14వ తేదీన బాలిక తల్లిదండ్రులు తమ అమ్మాయిని మతబోధకుడు ఎత్తుకెళ్ళినట్లుగా ఫిర్యాదు చేశారన్నారు. ఇతని ఆచూకి కోసం ప్రత్యేక దళాలను పంపి పట్టుకుని వచ్చి బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్‌ఐ చెప్పారు. తనను జోజి ప్రలోభపెట్టి లోబర్చుకుని, భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆ బాలిక తెలిపింది. జోజిపై నిర్భయ చట్టంతో పాటు పలు కేసులను నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ తెలిపారు.