రాష్ట్రీయం
బిసిలను విస్మరించిన ఎన్డిఎ సర్కార్: విహెచ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 September 2016
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: తాను బిసి ప్రధానిని అని ప్రచారం చేసుకోనే నరేంద్రమోదీ ఇప్పటి వరకు ఆ వర్గాలకు చేసిందేమీ లేదని ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావువిమర్శించారు. శనివారం నాడు లక్నోలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూపీ కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభా గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓబిసిల సమస్యలు పరిష్కరించడంలో ఎన్డీఎ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. జాతీయ బిసి కమిషన్కు చట్టబద్ధత కల్పించాలని విహెచ్ డిమాండ్ చేశారు. బిసిల సమస్యలపై ఎన్నిసార్లు ప్ర ధాని మంత్రి నరేంద్రమోదీని అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. యూపీలో ఎక్కువ జనాభా ఉన్న బిసిలు వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు.