ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ మొదటి వారంలో పోలీస్ కానిస్టేబుళ్లకు శారీర దారుఢ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి దరఖాస్తుల తుది గడువు శనివారంతో ముగిసింది. కాగా వీరికి నవంబర్ మొదటి వారంలో శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గత ఆగస్టు 27న కానిస్టేబుళ్ల (కమ్యూనికేషన్) నియామకానికి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 494 కానిస్టేబుళ్ల పోస్టులకు గానూ 62,319 దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు. 59,106 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 3,213 మంది మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,313 మంది అభ్యర్థులు ఓసి, 40,925 మంది బిసి, 11,419 ఎస్సీలు కాగా, 2,662 ఎస్టీ అభ్యర్థులున్నారు. అదేవిధంగా 5,009 డిప్లోమా, 27,480 ఇంటర్మీడియట్ ఎంపిసి, 22,891 మంది గ్రాడ్యుయేట్‌లు, 4,659 మంది డిగ్రీ అభ్యర్థులు కాగా, 2,280 మంది పోస్టు గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఉన్నారు. అయితే వీరికి నిర్వహించే టెస్ట్‌లకు గానూ ఈ నెల 20లోగా వెబ్‌సెట్ నుంచి తమ కాల్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన అతుల్ సింగ్ వివరించారు.