ఆంధ్రప్రదేశ్‌

ఎన్ని గడపలు ఎక్కినా జగన్ అవినీతిని కడగలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, అక్టోబర్ 16: అవినీతి కుంభకోణంలో కురుకుపోయిన జగన్ అవినీతిని ఎన్ని గడపలు ఎక్కినా కడగలేరని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు ధ్వజమెత్తారు. ఆదివారం ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయమార్కెట్ కమిటి నూతన కార్యవర్గ ప్రమాణాస్వీకారం కార్యక్రమంలో జరిగిన సభలో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నేతలు గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎన్ని గడపలు తిరిగినా వారి అవినీతిని కడగలేరని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రైతులకోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.