ఆంధ్రప్రదేశ్‌

జయలలిత కోలుకోవాలని శ్రీకాళహస్తిలో మహా మృత్యుంజయ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 16: తమిళనాడు సిఎం డాక్టర్ జయలలిత ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ శ్రీ కాళహస్తిలో ఆదివారం మహా మృత్యుంజయ యాగం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు భరద్వాజ తీర్థంలో యాగాన్ని జరిపించారు. దేవస్థానం పూజారులు, వేద పండితులు వేదమంత్రాలతో యాగాన్ని నిర్వహించారు. అనారోగ్యం నుంచి జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ యాగాన్ని నిర్వహించినట్లు ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు తెలిపారు.

చిత్రం.. శ్రీకాళహస్తిలో మహా మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్న దృశ్యం