ఆంధ్రప్రదేశ్‌

పున్నమి వెలుగుల్లో వరాల దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 16: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆదివారం పౌర్ణమి సందర్భంగా పున్నమి వెలుగుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులకు కనువిందుచేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యన మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి పున్నమి గరుడ సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. మలయప్పస్వామి సర్వాలంకార భూషితుడై సువర్ణునిపై విహరించిన వైనాన్ని తిలకించిన భక్తులు పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, సిబ్బంది, అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చిత్రం.. గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు