ఆంధ్రప్రదేశ్‌

పార్టనర్‌షిప్ సమ్మిట్ బోగస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: విశాఖలో నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజం లేదని మాజీ సభాపతి, ఏపిపిసిసి ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్ బోగస్ అని విమర్శించారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను అందించారు. ఈ సమ్మిట్‌కు ప్రభుత్వం అనవసర ఖర్చు చేసిందని, కోట్ల రూపాయల ప్రజాధనానికి లెక్కలు లేకుండా చూసేందుకు జీవో కాకుండా మెమోల ద్వారా ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఇంత ఖర్చుచేస్తే జరిగిన మేలు ఏమిటని ప్రశ్నించారు. సమావేశాలకు అయిన ఖర్చుల లెక్క సుమారు 28 కోట్ల రూపాయలని మనోహర్ వెల్లడించారు. 41 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించిందని, అయితే 600 మంది పాల్గొన్నారని వెలగపూడిలో ఆర్థిక మంత్రి చెప్పారన్నారు. ఈ లెక్కలకు అర్ధం ఏమిటని నిలదీస్తూ.. సుపరిపాలన, పారదర్శకత, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో జరిగిన సమ్మిట్‌లో 361 ఎంవోయులు కుదిరాయని, వీటిద్వారా 4,76,878 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపికి వస్తాయని, దీంతో 10,27,121 మందికి ఉపాధి లభిస్తుందని టిడిపి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిందన్నారు. కానీ ఈ సమ్మిట్ జరిగి ఇప్పటికి 10నెలలు పూర్తయిన సందర్భంగా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తేలిందన్నారు. స్వయానా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖపై సేకరించిన వివరాలిలావుంటే దీని అర్థమేమిటన్నారు. సమ్మిట్‌లో నాట్య కార్యక్రమానికే కోటి రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందన్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో పిసిసి సమాచార హక్కు చట్టం చైర్మన్ లక్ష్మీనారాయణ, పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్