రాష్ట్రీయం
పంట బీమా పరిహారం ఏది?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 26 October 2016
హైదరాబాద్, అక్టోబర్ 25: రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసినా నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదంటూ హైకోర్టు మంగళవారం ఆంధ్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, బీమా కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. కడప జిల్లా వేములపల్లి మండల పరిషత్ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2012-2013 రబీ సీజన్కు రాష్ట్రప్రభుత్వం పంటల బీమా పథకం కింద నష్టపరిహారం చెల్లించలేదంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సీజన్లో పంటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. అనంతరం ప్రభుత్వం వారం రోజుల్లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.