ఆంధ్రప్రదేశ్‌

నల్లమలపై నిత్యం నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, అక్టోబర్ 27: ఎఓబిలో జరిగిన సంఘటనతో కొంతకాలం నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో మావోయిస్టులు ఉన్నా లేకున్నా నల్లమల అటవీ ప్రాంతంలో నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నామని మార్కాపురం ఓఎస్‌డి కల్యాణలక్ష్మీ తెలిపారు. ఈ విలేఖరితో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం 140 మంది పోలీసులు తమవద్ద ఉన్నారని, నిత్యం పార్టీలను నల్లమల అటవీప్రాంతానికి పంపి కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్లమల అటవీప్రాంతంలో ఏమి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఎఓబి నుంచి మావోయిస్టు నేతలు నల్లమల అటవీప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తమకేమీ సమాచారం లేదని, ఒకవేళ వారు నల్లమలకు వచ్చినా తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపారు. నేతలు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసుశాఖకు సమాచారం ఇవ్వాలని ఓఎస్‌డి కల్యాణలక్ష్మీ కోరారు.