ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో మినీ హజ్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 29: ముస్లింలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు ప్రకటించారు. కర్నూలులో మూడు కోట్ల రూపాయలతో మినీ హజ్ హౌస్ నిర్మించనున్నట్లు క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం ప్రతినిధులకు తెలిపారు. హైదరాబాద్‌లో హజ్‌హౌస్ తన హయాంలోనే నిర్మించామని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కర్నూలులోని గణేష్ నగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న మసీదుకు ఆర్థిక సాయం చేయాలని కోరగా, 50 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జామియా మసీద్ విస్తరణలో మొదటి, రెండు అంతస్తుల నిర్మాణానికి రూ. 39.5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు చిత్తావారి వీధిలోని మసీదుకు ప్రహరీ నిర్మాణానికి రూ. 9 లక్షలు, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లోని శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈద్గాకు 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి కోరగా, సిఎం సానుకూలంగా స్పందించారు.