ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్యకు హోదా సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 4: కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు సభ నేపథ్యంలో ‘ప్రత్యేక ప్యాకేజీ వద్దు... ప్రత్యేక హోదానే ముద్దు..’ అంటూ నినదించిన జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జెఎన్‌టియు ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెంకయ్య బహిరంగ సభలో పాల్గొన్నారు. అప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు వేదికకు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పైకి ఎక్కారు. ప్రత్యేక హోదా కావాలంటూ నలుపు రంగు బెలూన్లను ఎగురవేశారు. ఇది గమనించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జనసేన నేత విజయగోపాల్ సహా 17 మందిని అదుపులోకి తీసుకుని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై కూడా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు సర్పవరం ఎస్సై వినయ్‌ప్రతాప్ చెప్పారు. కేంద్ర మంత్రి సభ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని అపార్టుమెంట్లపై ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా కొంతమంది పోలీస్ సిబ్బందిని నియమించామని, ఆ మేరకు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.