ఆంధ్రప్రదేశ్‌

‘ఎమ్మెల్సీ’ దరఖాస్తులు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 5: పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి వచ్చే మార్చిలో జరగనున్న ఎన్నికలకు ఓట్ల నమోదు సమయం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అయితే, రాత్రి ఏడు గంటల సమయంలో ఒక కళాశాల యాజమాన్యం ఒకేసారి ఏడు వేల దరఖాస్తులను తీసుకువచ్చి విశాఖ ఆర్డీఓకు ఇవ్వడానికి ప్రయత్నించింది. అంతకు కొద్ది సేపటి ముందే, సిపిఎం పార్టీకి చెందిన కొంతమంది వెళ్లి నాలుగు, ఐదు దరఖాస్తులు ఇవ్వాలని ప్రయత్నిస్తే, అధికారులు అందుకు అంగీకరించలేదు. కానీ ఈ ఏడు వేల దరఖాస్తులను తీసుకునేందుకు మాత్రం అధికారులు సిద్ధపడ్డారు. దీంతో సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో, దరఖాస్తులు తీసుకువచ్చిన వారితో గొడవపడ్డారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా వచ్చి ఏడు వేల దరఖాస్తులను కలెక్టరేట్ ముందు పడేసి, వాటిని తగులబెట్టారు. దీనిపై సిపిఎం నాయకులు మాట్లాడుతూ కొన్ని దరఖాస్తులపైనే ఫొటోలు, పేర్లు, సంతకాలు ఉన్నాయని, చాలా దరఖాస్తుల్లో సమాచారమే లేదని వారు ఆరోపించారు.