ఆంధ్రప్రదేశ్‌

హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 19: బిటెక్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య సంఘటన నుంచి తేరుకోక ముందే కర్నూలు జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లోక్‌నాథ్‌చౌదరి(17) శనివారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుగ్గలి మండలం అమీనాఅబ్బాస్‌నగర్‌కు చెందిన లోక్‌నాథ్‌చౌదరి కర్నూలు నగర శివార్లలోని నన్నూరు గ్రామం వద్ద ఉన్న శ్రీచైతన్య కాలేజిలో ఇంటర్(బైపిసి) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువులో చురుగ్గా ఉండే చౌదరి గత కొన్న రోజులుగా తీవ్ర మానసికి వేదనకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం సహచర విద్యార్థులు తరగతి గదులకు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత గదికి వచ్చిన విద్యార్థులు చూసి ప్రిన్సిపాల్‌కు విషయం చెప్పారు. ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.