ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల సోదాల్లో రూ. 65 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 19:ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్దపోలీసులు శనివారం ఉదయం ఒక కారులో సోదాలు చేయగా ఎటువంటి పత్రాలు లేని 65లక్షల రూపాయలు కన్పించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును విజయవాడలోని డిప్యూటీ ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌కు పంపించారు. గుంటూరు జిల్లాలోని త్రిపుల్ ఎక్స్ సబ్బుల కంపెనీలో పనిచేసే తోట ప్రసాద్ శనివారం ఉదయం ఒంగోలు నుండి గుంటూరుకు కారులో 65 లక్షల రూపాయలను తీసుకువెళ్తుండగా పోలీసుల తనిఖీలో బయటపడింది. పోలీసులు ఆ నగదును,ప్రసాద్‌ను విజయవాడకు తరలించారు.