ఆంధ్రప్రదేశ్‌

చిల్లర సమస్య తెచ్చిన తంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం/పరిగి, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఆ చిరు వ్యాపారి ప్రాణాలమీదికి తెచ్చింది. సరుకులు కొనుగోలుకు వచ్చిన వారు ఇచ్చిన పెద్దనోటు తిరస్కరించడంతో వారు కక్షగట్టి ఆ చిరువ్యాపారిపై బేడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వికలాంగుడైన రాజ్‌కుమార్(38) కోనాపురంలో చిన్నపాటి దుకాణం నిర్వహిస్తున్నాడు. జూలప్ప, నారాయణప్ప అతని వద్ద రూ.200 సరుకులు కొనుగోలు చేసి రద్దయిన రూ.500 నోటు ఇచ్చారు. పెద్దనోట్లు చెల్లవని చిల్లర ఇవ్వాలని, లేదంటే సరుకులు ఇవ్వనని రాజ్‌కుమార్ ఖరాఖండిగా చెప్పాడు. తమకు సరుకులు ఇవ్వలేదని రాజ్‌కుమార్‌పై కక్షగట్టిన జూలప్ప, నారాయణప్ప శుక్రవారం రాత్రి రాజ్‌కుమార్ దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని బ్లేడ్లతో దాడిచేశారు.