ఆంధ్రప్రదేశ్‌

చెరువులో మునిగి తోడికోడళ్ళు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, నవంబర్ 19: శ్రీకాకుళం జిల్లా, బుడుమూరు పంచాయతీ కలిశెట్టిగూడెంలో తోడుకోడళ్ళు చెరువులో మునిగి మృతి చెందారు. కలిశెట్టిగూడెంకు చెందిన కలిశెట్టి కృష్ణ భార్య లక్ష్మి(40), కృష్ణసోదరుడు ఆదినారాయణ భార్య కొండమ్మ(38) శనివారం బట్టలు ఉతుక్కునేందుకు సమీపంలోని పెద్దగెడ్డకు వెళ్లారు. కబుర్లు చెప్పకుంటూ బట్టలు ఉతుక్కుంటుండగా అకస్మాత్తుగా లక్ష్మి కాలు జారి నీటిలో పడిపోయింది. రక్షించమని లక్ష్మి కేకలు పెడుతుంటడంతో ఆమెను రక్షించబోయిన తోటికోడలు కొండమ్మ గట్టుపైనుండి చేయి అందించి ఆమె కూడా నీటిలోనికి జారి పడిపోయింది. గెడ్డలోని గోతుల్లో ఇద్దరు మునిగిపోయి మృతి చెందారు.