రాష్ట్రీయం

రూ.8 లక్షల వంద నోట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, డిసెంబర్ 2: పది శాతం కమిషన్‌కు వందనోట్లను తీసుకువస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విలేఖర్ల సమావేశంలో సత్తుపల్లి డిఎస్పీ బి.రాజేష్ వెల్లడించారు. ఆంధ్రలోని కృష్ణా జిల్లా మైలవరం గ్రామానికి చెందిన వెంకట్రావు, సుబాశీలు కారులో సత్తుపల్లికి రూ.8 లక్షల వంద నోట్లను తీసుకొస్తున్నారన్న సమాచారంతో స్థానిక తహశీల్దారు కార్యాలయం సమీపంలో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 10 శాతం కమిషన్‌కు సత్తుపల్లిలో కొందరు వ్యక్తులకు ఇచ్చేందుకు రూ.100 నోట్లు తీసుకొని పాత రూ.500 నోట్లు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. సత్తుపల్లి తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య సమక్షంలో పంచనామా చేసి రూ.8 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు.