ఆంధ్రప్రదేశ్
పద్మావతి అమ్మవారికి ఘనంగా పుష్పయాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 December 2016
తిరుపతి, డిసెంబర్ 5: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి గత పది రోజులుగా నిర్వహించిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఈక్రమంలో సోమవారం అమ్మవారికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. ఈసందర్భంగా టిటిడి అధికారులు 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలను గంపల్లో ఉంచుకుని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.