ఆంధ్రప్రదేశ్‌

శేఖర్‌రెడ్డికి టిడిపితో సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: చెన్నైలో అక్రమంగా కోట్లాది రూపాయలు పట్టుబడిన, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి ఎపి తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితులపై నిఘా పెడితే మరింత నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్నీ ప్రాంతాల్లో అంతు చిక్కని కాళ్ళ వాపు వ్యాధితో పదుల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా, పౌష్టికాహార లోపంతో శిశుమరణాలు సంభవిస్తున్నా, కాలేజీలు, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కరువైనా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. పోలవరం నిర్వాసితులపై ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలేమిటో స్పష్టం చేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు.