ఆంధ్రప్రదేశ్‌

50లక్షలు దాటిన టిడిపి సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 12: దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, మీరు త్యాగాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశంసించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్యకర్తలు, నాయకులను వేధింపులకు గురిచేయటంతో పాటు 150 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. అయినా మొక్కవోని దీక్షతో పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. ఏపీలో పార్టీ 50 లక్షల సభ్యత్వం పూర్తిచేసిన సందర్భంగా సోమవారం ఇక్కడి రాష్ట్ర టిడిపి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత ఏడాది 50 రోజుల్లో అరకోటి సభ్యత్వం నమోదు చేస్తే, ఈ ఏడాది స్వల్ప వ్యవధిలోనే అటు తెలంగాణ, ఇటు ఏపిలో త్వరితగతిన లక్ష్యాన్ని అధిగమించ గలిగామన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో 17 శాతం టిడిపి సభ్యత్వం కలిగిన వారై ఉండాలనేది తమ ఆకాంక్షగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 3400 మంది కుటుంబాలను ఆదుకున్నామని, మరో 12లక్షల మందికి ప్రమాద బీమా కింద రూ.2లక్షల పరిహారాన్ని అందించామన్నారు.

చిత్రం..రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేక్ కట్‌చేస్తున్న నారా లోకేష్